లాక్ డౌన్ ఎఫెక్ట్ తో పనులు లేక ఆర్థికంగా నష్ట పోయి తమ సొంత రాష్ట్రాలకు నడుచుకుంటూ వెళుతున్న వలస కూలీలకు పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ భోజనం అందించారు. వలస కార్మికులు నడచుకుంటూ వెళ్లాల్సిన అవసరం లేదని, సంబంధిత రాష్ట్రాల అధికారులతో మాట్లాడిన తర్వాత వారు తమ రాష్ట్రాలకు వెళ్లవచ్చునని ఈ సందర్భంగా సత్యనారాయణ వారికి తెలిపారు.
కేంద్ర హోం శాఖ ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని ఆయన వివరించారు. వలస కార్మికులు ఆకలితో ఉండాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారని, అందుకు అనుగుణంగానే దాతల సాయంతో వారికి భోజనాలు ఏర్పాటు చేస్తున్నామని పోలీస్ కమిషనర్ వెల్లడించారు.