ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ఈ నెల 15న పరీక్షలు జరపగా ఇవాళ కరోనా పాజిటివ్ గా ఫలితం వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. గవర్నర్ బిశ్వభూషణ్ అస్వస్థతకు గురికావడంతో విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు తరలించారు. దిల్లీ పర్యటన ముగించుకొని విజయవాడ చేరుకున్న ఆయన రెండు రోజులుగా దగ్గు, జలుబుతో ఇబ్బంది పడుతున్నారు. ముందు జాగ్రత్త చర్యగా ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించారు. ఇప్పుడు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
previous post