ఈ నెల 18న థియేటర్స్ లో అర్జీవి కుటుంబ కథా చిత్రం మర్డర్ రాబోతున్నది. ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ…కుటుంబ కథా చిత్రం మర్డర్ సెన్సార్ సభ్యుల నుండి యు/ఏ సట్టిఫికెట్ పొందిందని తెలిపారు.
ఈనెల 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కాబోతోందని తెలిపారు. నిర్మాతలు నట్టి కరుణ, నట్టి క్రాంతి మాట్లాడుతూ… న్యాయం గెలుస్తుందని మేము మొదటి నుండి చెబుతూ ఉన్నాము.
మర్డర్ సినిమా విడుదల అవ్వకుండా అనేక ఇబ్బందులు పెట్టారు. చివరికి మాకు న్యాయం జరిగింది. డిసెంబర్ 18న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.
ఈ సినిమా ఎవ్వరినీ ఉద్దేశించి తీసినది కాదు. అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించే విధంగా ఈ మూవీ ఉండబోతొందని తెలిపారు.