సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మంగళవారం పట్టణ అధ్యక్షుడు ముసుకుల చంద్రారెడ్డి ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా చంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తీసుకుని వచ్చిన వ్యవసాయ బిల్లును, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర,రైతులు స్వేచ్ఛగా తమ పంటలను దేశంలో ఎక్కడైనా అమ్ముకునే సౌకర్యం కల్పించడం అనేది రైతులకు ఈ చట్టం వరంగా మారిందని అన్నారు.
రైతులకు మేలు చేసే కార్యక్రమాన్ని స్వాగతించాలని కోరారు. ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ బీజేపీ నాయకులు రామరాజు, గుండా గోపి, శివ, వీరబాబు, విజయ్, రవి నాయక్, శ్రీను, పార్టీ కార్యకర్తలు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.