40.2 C
Hyderabad
April 26, 2024 12: 12 PM
Slider నల్గొండ

రైతుకు మేలు చేస్తున్న నరేంద్ర మోడీకి పాలాభిషేకం

#BJPHujurnagar

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మంగళవారం పట్టణ అధ్యక్షుడు ముసుకుల చంద్రారెడ్డి ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

ఈ సందర్భంగా చంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తీసుకుని వచ్చిన  వ్యవసాయ బిల్లును, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర,రైతులు స్వేచ్ఛగా తమ పంటలను దేశంలో ఎక్కడైనా అమ్ముకునే సౌకర్యం కల్పించడం అనేది రైతులకు ఈ చట్టం వరంగా మారిందని అన్నారు.

రైతులకు మేలు చేసే కార్యక్రమాన్ని స్వాగతించాలని కోరారు. ఈ కార్యక్రమంలో  హుజూర్ నగర్ బీజేపీ నాయకులు రామరాజు, గుండా గోపి, శివ, వీరబాబు, విజయ్, రవి నాయక్, శ్రీను, పార్టీ కార్యకర్తలు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ప్రజాసమస్యల పరిష్కారానికే ప్రధమ ప్రాధాన్యం

Satyam NEWS

హెల్ప్ డెస్క్: కోవిడ్ సోకిన తల్లిదండ్రుల పిల్లలకు భరోసా

Satyam NEWS

పొంగులేటి తో టీడీపీ నేతల భేటీ

Bhavani

Leave a Comment