చికెన్ నాణ్యతను పాటిస్తూ ప్రజల మన్ననలను పొంది వ్యాపారంలో బాగా రాణించాలని ఉప్పల్ ఎమ్మేల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. చిలుకా నగర్లో నిర్వహకులు బోనగిరి రాజు ఏర్పాటు చేసిన స్నేహ రామిరెడ్డి చికెన్ సెంటర్ను ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిధులుగా ఉప్పల్ ఎమ్మేల్యే బేతి సుభాష్రెడ్డి, స్థానిక కార్పోరేటర్ బన్నాల గీతప్రవీణ్ముదిరాజ్ హజరై ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మేల్యే మాట్లాతూ చికెన్ సెంటర్ను శుభ్రంగా ఉంచుకోవాలని , కరోనా సమయంలో ప్రొటీన్స్ ఎక్కువగా ఉన్న చికెన్ తినాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో చిల్కానగర్ డివిజన్ అధ్యక్షులు బన్నాల ప్రవీణ్ముదిరాజ్, సీనియర్ నాయకులు పల్లె నర్సింగరావు, వి.బి.నర్సింహ, ఎదుళ్ళ కొండల్రెడ్డి, రాంరెడ్డి, మాస శేఖర్, రవీందర్గౌడ్, పుష్పరాజ్, బాలు,రాజు, తదితరలు పాల్గొన్నారు.
previous post