గిరిజన లాంబడిలు ప్రతిష్టాత్మకంగా జరుపుకునే తీజ్ పండగ వేడుకల్లో మాజీ పార్లమెంటు సభ్యులు, ప్రొపెసర్ సీతారాం నాయక్ పాల్గొన్నారు. ఈరోజు ములుగు జిల్లా ములుగు మండలం బండారు పల్లి గ్రామంలో జరిగిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ సీతారాం నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ లాంబడి తండాలను గ్రామపంచాయతీ గా ఏర్పాటు చేసి అభివృద్ధి జరిగే విధంగా చర్యలు తీసుకున్నారని తెలిపారు. బంజారా జాతి జీవన విధానాన్ని ప్రతిబించే పండగ తీజ్ పండగ.9 రోజులు ఆట పాటలతో జరుపుకుంటామని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చే ఏడాది కొంత ఆర్థిక సహాయం అందించి తండా గ్రామపంచాయతీ లలో అధికారికంగా ఈ తీజ్ పండగ జరిపించాలని కోరుతున్నానని తెలిపారు.