రంజాన్ షాపింగ్ పేరుతో హైదరాబాద్ లో జనం పెద్ద సంఖ్యలో బయటకు వస్తున్నారు. హైదరాబాద్ లోని బేగంబజార్ రంజాన్ సందర్భంగా ఆహార పదార్ధాల షాపింగ్ కు ప్రధాన కేంద్రం. బేగం బజాజ్ నుంచి రిటైల్ షాపులు వారు హోల్ సేల్ రేట్లకు కొనుగోలు చేస్తారు.
అంతే కాదు ఈ నెల మొత్తం కావాల్సిన సరకుల కోసం పెద్ద పెద్ద కుటుంబాల వారు కూడా ఇక్కడకే వచ్చి కొనుగోలు చేస్తారు. చాలా సంవత్సరాలుగా ఇదే జరుగుతున్నందున ప్రస్తుతం లాక్ డౌన్ అమలులో ఉన్నా కూడా ఆ అలవాటును మార్చుకోలేకపోతున్నారు.
రంజాన్ సందర్భంగా కొనుగోలు పెద్ద ఎత్తున సాగుతుందనే ఉద్దేశ్యంతో బేగంబజార్ హోల్ సేల్ యజమానుదారులు కూడా దుకాణాలు తెరచి పెద్ద ఎత్తున వస్తున్న కష్టమర్లకు సరకులు అమ్ముతున్నారు. పైన ఫొటోలో చూపిన పరిస్థితి నేడు బేగంబజార్ లో నెలకొంది.
ఊహించండి ఒక్క సారి…. ఈ జనంలో ఏ ఒక్కరికి కరోనా ఉన్నా ఏమౌతుందో? రంజాన్ సందర్భంగా లాక్ డౌన్ నిబంధనలు సడలించి వెసులు బాటు కల్పించడంతో హైదరాబాద్ పోలీసులకు కూడా ఈ జనాభాను అదుపు చేయడం కష్టమౌతోంది.