జాతీయ స్థాయి బాడీ బిల్డర్స్ పోటీలలో ఆరవ స్థానంలో విజయనగరం బిడ్డ
కలియుగ భీముడు కోడిరామమూర్తి అంటే ఎవ్వరో తెలియని ప్రస్తుత ఈ ఏండ్రాయిడ్,స్మార్ట్ ఫోన్ లు నిరంతరం చూసే మనుషులకు… అతని పవరేంటో…ఈ ఆదునిక ప్రపంచం గుర్తించేలా… జాతీయ స్థాయి బాడీ బిల్డర్స్ పోటీలలో ఆరవ స్థానం నిలిచారు….విజయనగరానికి చెందిన కోరాడ శ్రీనివాసరావు.ఈ నెల 15వ తేదీ నుండి 19వ తేది వరకు పూణే లో జరిగిన మిస్టర్ ఇండియా 2022 జాతీయ స్థాయి బాడీ బిల్డర్స్ పోటీలలో రాష్ట్రం తరుపున ఆడిన కోరాడ శ్రీనివాసరావు 6వ స్థానం సాధించారు.
కోరాడ శ్రీనివాసరావు ఇండియా లెవెల్ లో విజయనగరం నుంచి పతకం సాధించడం గర్వకారణమన్నారు..,జిల్లా బాడీ బిల్డర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రెడ్డి శంకరరావు..ఈ మేరకు కోరాడ శ్రీనివాసరావుకు విజయనగరం జిల్లా బాడీ బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన అభినందన సత్కారం కార్య క్రమాన్ని ఉద్దేశించి రెడ్డి శంకరరావు మాట్లాడారు.
కొడిరామూ ర్తి వారసత్వాన్ని శ్రీనివాసరావు నిలబెట్టారని… భావితరాలకు ఎంతో స్ఫూర్తి దాయకంగా ఆయన నిలిచారన్నారు. అలాగే కమిటీ సభ్యులు… ఆయన శిష్యులు అయిన తోట అజయ్, రవి, శివ్వా సురేష్, సన్నిబాబు గార్లు మరియు ఆశోసియేసన్ ఉపాధ్యక్షుడు రమేష్ అభినందించారు. భవిష్యత్ లో మరిన్ని పతాకాలు శ్రీనివాసరావు సాధించాలని ఆకాంక్షించారు.