కడప జిల్లా రాజంపేట లోని వివిధ ప్రాంతాల్లో పేద వారికి ఆదివారం వైసీపీ నేతలు కూరగాయల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాజంపేట ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు మెంబరు మేడా వేంకట మల్లికార్జున రెడ్డి, రైల్వే కోడూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు, మాజీ శాసన సభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి డిఎస్పీ నారాయణ స్వామి రెడ్డి ముఖ్య అతిధులు గా పాల్గొన్నారు.
మండలం లోని మందరం, సీతారాంపురం, మన్నూరు, కూచివారి పల్లి పంచాయతీలో పేద ప్రజలకు అవసరమైన బియ్యం కూరగాయలు దాదపు గా 2000 కుటుంబాల వారికి అందజేసారు.
ఇంకా ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు పోలా రమణారెడ్డి, ఆకేపాటి మురళి రెడ్డి ,వెలగ చెర్ల గంగి రెడ్డి , మందరం వేణుగోపాల్ రెడ్డి ,గురు ప్రతాప రెడ్డి,పోలా శ్రీనివాసులు రెడ్డి , యోగీశ్వర రెడ్డి, చెర్లోపల్లి శివరామరాజు , హస్త వరం ఉమా మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.