మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి పబ్లిసిటీ పిచ్చి ఉందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు వీలున్నప్పుడల్లా తిడుతుంటారు. మా నాయకుడికి పబ్లిసిటీ కన్నా పని పైనే శ్రద్ధ అని మునిసిపల్ వ్యవహారాల శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పనిగట్టుకుని మరీ చెబుతుంటారు.
అబ్బే ఇవ్వన్నీ పైపై కబుర్లే. ఆంధ్రప్రదేశ్లో రేపటి నుంచి రెండో విడత రేషన్ పంపిణీ జరగనుంది. అందుకోసం రేషన్ సరుకులకు కూపన్లు సిద్ధం చేస్తున్నారు. రెండో విడతలో ఉచితంగా 5 కేజీల బియ్యం, కేజీ శనగలు ఇస్తారు. ఇందుకోసం 14 వేల రేషన్ షాపులకు అదనంగా కౌంటర్లు ఏర్పాటు చేశారు.
కూపన్లపై ఉన్న తేదీల్లో మాత్రమే రేషన్ షాపు వద్దకు రావాలని ప్రజలకు సూచించారు. ఈ కూపన్ పై ప్రభుత్వం లోగోతో బాటు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫొటో ఉంది. ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అండీ, ఆయన ఫొటో పెట్టక నీ ఫొటో పెడతారా అని ఎవరైనా ప్రశ్నించవచ్చు. తప్పేంలేదు. ప్రశ్నించడం తప్పు కాదు. ఆయన ఫొటో వేసుకోవడం తప్పూ కాదు. ఎదుటివాడ్ని తిట్టేటప్పుడు చూసుకొని తిట్టాలి. అంతే చెప్పేది.