చిత్తూరు జిల్లా పీలేరు మండలం ఒంటిళ్లు గ్రామం సమీపంలోని జరిగిన రోడ్డు ప్రమాదం పెను విషాదాన్ని మిగుల్చింది. ఈ ప్రమాదంలో విషాదకరంగా ఒక బాలింత మృతి చెందింది. కేవలం రెండు వారాల వయసు ఉన్న పసి కందు కూడా ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడటం విషాదం.
లక్కిరెడ్డిపల్లి మండలం కున్నూతల గ్రామానికి చెందిన అంజలి (32) అనే చికిత్స కోసం తిరుపతి కి వెళుతుండగా టోల్ ప్లాజా వద్ద కారు బోల్తా పడింది. దాంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో అంజలి నవజాత శిశువు (2 వారాలు), భర్త ఆంజనేయులు, మరిది రమణ, మామ తిరుమలయ్య, అమ్మ చిట్టెమ్మకు గాయాలు.
వీరిలో శిశువు పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలింపు. మిగిలిన వారికి పీలేరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు.