28.7 C
Hyderabad
May 6, 2024 09: 09 AM
Slider కరీంనగర్

డెవలప్మెంట్ :సంక్షేమ పథకాలు చూసి ఓటు వేయాలి

ravi shankar

ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులతో పాటు, తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు చూసి టీఆర్ఎస్ కు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు .పట్టణమున్సిపాలిటీ ఎన్నికలలో భాగంగా పట్టణంలోని వివిధ వార్డుల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల తరఫున విన్నూత ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పట్టణంలోని ఒక హోటల్ లో సర్వపిండి తయారు చేస్తూ ప్రచారం నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులతో పాటు, తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు చూసి టీఆర్ఎస్ కు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు.

చొప్పదండి పట్టణము అభివృద్ధి చెందాలంటే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని అన్నారు. ఈ ప్రచారంలో ఆయనతోపాటు గ్రంథాలయ ఛైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, గడ్డం చుక్కరెడ్డి, మచ్చ రమేష్, చంద్రశేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఇంటి పన్ను వసూళ్లలో వేగం పెరగాలి

Bhavani

టి‌ఆర్‌ఎస్ భారీ ర్యాలీ

Murali Krishna

కొల్లాపూర్ డివిజన్ టిఎన్జీవో సంఘం ఎన్నికలు పూర్తి

Satyam NEWS

Leave a Comment