విశాఖను పరిపాలనా రాజధానిగా గతంలో ప్రకటించిన ఏపీ ప్రభుత్వం.. ఇందుకు విజయ దశమిని ముహూర్తంగా ఖరారు చేసింది. దసరా నుంచి సాగర నగరం నుంచి పాలన మొదలవుతుందని ఇవాళ భేటీ అయిన కేబినెట్ తీర్మానించింది. ఇప్పటికే అక్కడ సీఎం నివాసం సహా పలు నిర్మాణాలు జరుగుతున్నాయి.
రాజధాని తరలింపుపై ఇప్పటికే క్షేత్రస్థాయిలో, కోర్టుల్లో కొన్ని వివాదాలున్నా.. ప్రభుత్వం వెనక్కి తగ్గకుండా నిర్ణయాన్ని అమలు చేస్తుండటం గమనార్హం.