తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా పామర్రు నియోజకవర్గ ఇంచార్జ్ వర్ల కుమార్ రాజా ఆధ్వర్యంలో రిలేనిరాహార దీక్ష నిర్వహించారు. పామర్రు లో జరిగిన ఈ రిలే నిరాహారదీక్ష కి నందమూరి రామకృష్ణ సంఘీభావం తెలిపారు.
ఈ కార్యక్రమంలో గార్లపాటి శ్రీనివాసరావు, రాష్ట్ర బీసీ సెల్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి వీరంకి వెంకట గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఐదు మండలాల అధ్యక్ష కార్యదర్శులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు,రాష్ట్ర నాయకులు,పార్లమెంట్ నాయకులు ,నియోజకవర్గ నాయకులు,తెలుగుయువత నాయకులు,మచిలీపట్నం పార్లమెంట్ తెలుగు మహిళలు,TNSF నాయకులు,అనుబంధ సంఘాలు, గ్రామ నాయకులు,కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.