రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగ ఖాళీలలను భర్తీ చేయడంలేదని తీవ్ర నిరుత్సాహంతో ఆత్మహత్యాయత్నం చేసుకున్న సునీల్ నాయక్ నేడు మరణించాడు.
గత నెల 26 న హన్మకొండలో పురుగులమందు తాగి సునీల్నాయక్ ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆత్మహత్యాయత్నానికి ముందు సునీల్ ఒక సెల్ఫీ వీడియో విడుదల చేశాడు.
ప్రభుత్వం ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయట్లేదని అందులో ఆవేదన వ్యక్తం చేశాడు. అనంతరం అతడిని హైదరాబాద్ లోని నిమ్స్ లో చికిత్స కోసం చేర్పించారు.
చికిత్స పొందుతూ సునీల్ నాయక్ అక్కడే మరణించాడు. మృతి చెందిన సునీల్ నాయక్ స్వస్థలం గూడూరు మండలం తేజవత్ రాంసింగ్ తండా.