లవ్ జిహాద్ పేరుతో అన్య మతస్థులను పెళ్లి చేసుకుని మతమార్పిడులకు పాల్పడుతున్న వారి ఆట కట్టించేందుకు మధ్య ప్రదేశ్ ప్రభుత్వం చట్టం తీసుకువచ్చింది.
ప్రేమ పేరుతో అన్య మతస్థులను వలపన్ని పట్టుకుని వారిని పెళ్లి చేసుకుని మతం మార్పిస్తే అది నేరం అవుతుంది.
ఈ మేరకు సదరు అమ్మాయి తల్లిదండ్రులుగానీ, రక్త సంబంధీకులు గానీ లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే పోలీసులు ఆ కేసు దర్యాప్తు చేపడతారు.
ఇలా దర్యాప్తు చేపట్టి నేర నిరూపణ అయితే వారికి పది సంవత్సరాల వరకూ కఠిన కారాగార శిక్ష విధించేందుకు వీలు కలిగిస్తూ మధ్యప్రదేశ్ ప్రభుత్వం చట్టం రూపొందించింది.
మధ్య ప్రదేశ్ శాసనసభ దీనికి సంబంధించిన బిల్లును ఇప్పటికే ఆమోదించగా దాన్ని గవర్నర్ ఆమోదించడంతో చట్టంగా రూపుదిద్దుకున్నది.