29.7 C
Hyderabad
May 2, 2024 05: 14 AM
Slider జాతీయం

బాలికపై అత్యాచారం చేసిన వాడికి మరణ శిక్ష

#DeathSentence

పది సంవత్సరాల ముక్కుపచ్చలారని బాలికపై అత్యాచారం చేసిన ఒక మృగానికి ఉత్తరప్రదేశ్ కోర్టు మరణ శిక్ష విధించింది.

గత ఏడాది డిసెంబర్ లో ఫిరోజాబాద్ లోని జస్రానా పోలీసు స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో నీరజ్ ఒక వ్యక్తి 10 సంవత్సరాల బాలికపై అత్యాచారం చేశాడు.

మూడున్నర నెలల కాలంలోనే పోలీసులు సాక్ష్యాధారాలు సమర్పించడంతో ప్రత్యేక పోక్సో కోర్టు అదనపు సెషన్స్ జడ్జి నేరాన్ని ఖరారు చేశారు.

బాలికను మభ్యపెట్టి ఏకాంత ప్రదేశానికి తీసుకువెళ్లి బాలికపై అతడు డిసెంబర్ 14న ఈ నేరానికి పాల్పడ్డాడు.

నేరం రుజువు కావడంతో రికార్డు సమయంలోనే నేరస్తుడికి మరణ శిక్ష విధిస్తూ న్యాయమూర్తి మృదుల్ దుబే తీర్పు చెప్పారు.    

Related posts

మహిళా టీచర్ల కు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వండి

Satyam NEWS

సిఎం సొంత జిల్లాలో అధ్వాన్నంగా రహదారులు

Satyam NEWS

Good News: 23 నుంచి మళ్లీ రిజిస్ట్రేషన్లు షురూ

Satyam NEWS

Leave a Comment