దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖరరెడ్డి తమ్ముడికే న్యాయం జరుగకపోతే సామాన్యుడి పరిస్థితి ఏంటి ? అని ప్రశ్నిస్తున్నారు మాజీ మంత్రి, దారుణ హత్యకు గురైన వై ఎస్ వివేకానందరెడ్డి కుమార్తె.
రెండు సంవత్సరాలు కావస్తున్నా తన తండ్రి హంతకులను పట్టుకోలేదని వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత అన్నారు.
తన తీవ్ర నిరసన తెలిపేందుకు ఆమె నేడు సీబీఐ అధికారులను కలిశారు.
ఇంతవరకు ఎవరు హత్యచేసారో తెలియలేదు, వైసీపీ అధికారంలో ఉన్నా మాకు న్యాయం జరుగలేదు అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.