వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం మంబాపూర్ గ్రామంలో దారుణం జరిగింది. తొమ్మిదో తరగతి చదువుతున్న రేణుక అనే అమ్మాయి ఇంట్లో దూలానికి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నది.
తాను చేయని తప్పుకు తనను నిందించారని రేణుక మనస్తాపానికి గురైంది. దానికి తోడు ఇంట్లోని వారు పెళ్లి సంబంధాలు చూస్తున్నారట.
ఈ కారణాలతో రేణుక మనసు తీవ్రంగా గాయపడ్డది. ఇంట్లోని వారు కూడా తనను పట్టించుకోకపోవడంతో రేణుక ఆత్మహత్య చేసుకున్నది.
బంధువులు ఈ సంఘటన పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రేణుక రాసినట్లు చెబుతున్న సుసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు.