26.7 C
Hyderabad
April 27, 2024 08: 17 AM
Slider జాతీయం

లక్కీ ఫెలోస్: ఏటీఎంలోరూ.100 నోట్లకు బదులు రూ.500 నోట్లు

atm rs 500

కర్నాటకలోని కొడగు పట్టణంలోని మడికేరిలోని ఓ ఏటీఎం మిషన్ లో వందరూపాయల నోట్లకు బదులు ఐదువందల నోట్లు రావడంతో కార్డు తో డబ్బు తీసుకోవాలన్న బ్యాంకు ఖాతా దారులు ఆ ఏటిఎం ముందు బారులు తీరారు.ఈ విషయం కొందరు బ్యాంకు అధికారులకు తెలిపే లోపే ఖాతా దారులు రూ.1.7 లక్షల నగదును విత్ డ్రా చేసుకుని వెళ్లిపోయారు.

ఈ విషయంపై తమకు బ్యాంకు ఎలాంటి ఫిర్యాధుఅందలేదని పోలీసులు తెలుపుతున్నారు. వినియోగదారులు డబ్బును విత్ డ్రా చేసుకుంటూంటే రూ.100 నోట్లకు బదులు రూ.500 నోట్లు రావడంతో ఆశ్చర్యపోయినప్పటికీ వచ్చిన డబ్బును జేబులో పెట్టుకొని ఎం చక్క వెళ్లిపోయారు.

దీనిపై పట్టణ ఎస్పీ సుమన్ పెనిక్కర్ఏ మాట్లాడుతూ ఏటీఎం లో 500 నోట్లు రావడం కు సంబంధించి బ్యాంకు అధికారుల నుండి తమకు ఫిర్యాధు రాలేదన్నారు. ఏటీఎంలో నగదును ఉంచే సంస్థ పొరబాటు చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. రూ.100 నోట్లు ఉంచాల్సిన ట్రేలో రూ.500 నోట్లు ఉంచడం తో ఈ పరిస్థితి కలిగిందన్నారు.

బ్యాంకు అధికారులు డబ్బును విత్ డ్రా చేసినవారిని గుర్తించి డబ్బును ఇవ్వాలని కోరగా కొంతమంది మాత్రమే తిరిగి ఇచ్చారు. లక్కీ ఫెలోస్ : ఏటీఎంలోరూ.100 నోట్లకు బదులు రూ.500 నోట్లు

Related posts

గుంటూరు రేంజ్ ఐజీని కలిసిన పల్నాడు జిల్లా ఎస్పీ

Bhavani

ధాన్యం సేకరణకు ఏర్పాట్ల

Murali Krishna

గ్రీన్ ఛాలెంజ్ లో మొక్కలు నాటిన చిరంజీవి కుమార్తె సుస్మిత

Satyam NEWS

Leave a Comment