కేరళ మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ మృతి పట్ల టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంతాపం తెలియజేశారు. ప్రజా నాయకులు ఉమెన్ చాందీ, ఆయన మరణం కేరళకు తీరని లోటన్నారు. ఒక గొప్ప నాయకుడిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు.
రెండు సార్లు ముఖ్యమంత్రిగా, నాలుగు సార్లు మంత్రిగా, 12 సార్లు ఎమ్మెల్యేగా దాదాపు ఐదున్నర దశాబ్దాల పాటు ప్రజా జీవితంలో వివిధ హోదాలలో చాందీ పని చేశారన్నారు. ఆయన మరణం కేరళ ప్రజానీకానికి కాంగ్రెస్ పార్టీ కి తీరని లోటని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆయన మృతి పట్ల రేవంత్ రెడ్డి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.