హైదరాబాద్ లోని బాలా నగర్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించే వాసవి ట్రస్ట్ భవనం నిర్మాణం కోసం ఉప్పల ఫౌండేషన్ ఒక లక్ష రూపాయలు విరాళం అందించింది. ఉప్పల ఫౌండేషన్ చైర్మన్, తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త సంబంధిత చెక్ ను బాలానగర్ ఆర్యవైశ్య సంఘం కు నేడు అందచేశారు. నాగోల్ లోని ఆయన నివాసంలో బాలానగర్ మండల ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో దారం వెంకటేశం గుప్త, గన్ను తిరుపతయ్య, పడకంటి శ్రీనివాస్, ముత్యం ప్రభాకర్, దారం సతీష్ గుప్త, శివశంకర్, రవీందర్ బాలానగర్ ఆర్యవైశ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
previous post