హైదరాబాద్ నగరంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమంపై డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం లో మంత్రి కేటీఆర్ అధ్యక్షతన జరిగిన విస్తృత స్థాయి సమీక్ష సమావేశంలో అంబర్పేట్ శాసనసభ్యులు కాలేరు వెంకటేష్ పాల్గొన్నారు. మొదటి దశ లో 11,700 వేల ఇండ్లను ఎలాంటి ఇబ్బందులు లేకుండా పేదలకు అందించామని తెలిపారు. ఈనెల 21వ తేదీన రెండవ దశ లో దాదాపు మరో 13,300 ఇండ్లను మరోసారి అందించనున్నమన్నారు. ఈ సమావేశంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, మల్లారెడ్డి, నగర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట్