టీడీపీ అధినేత ,మాజీ సీఎం చంద్రబాబు అక్రమ అరెస్ట్ ఖండిస్తూ రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా “దేశం” నేతలు కాగడాల ర్యాలీ నిర్వహించారు. అందులో భాగంగా విజయనగరం లో రాత్రి ఏడు గంటలకు.. విజయనగరం లో హనుమాన్ జంక్షన్ నుంచీ ఆర్.అండ్.బీ గెస్ట్ హౌస్ వరకు టీడీపీ నేతలు కాగడాలతో ర్యాలీ నిర్వహించారు. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై నంద్యాలలో అరెస్ట్ వారెంట్ జారీ చేయడం పై రాష్ట్ర వ్యాప్తంగా దేశం శ్రేణులు ఆందోళన కు దిగారు. అందులో భాగంగా విజయనగరం జిల్లా లో టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ లు చేశారు. దీంతో అక్రమ అరెస్ట్ లను ఖండిస్తూ టీడీపీ నేతలు నిరసన చేశారు. విజయనగరం లో బాలాజీ, గురజాడ, కలెక్టరేట్ ల వద్ద టిడిపి నేతలు ధర్నా చేస్తుండగా పోలీసులు వారందరినీ అరెస్ట్ చేశారు. దీన్ని ఖండిస్తూ టీడీపీ నేతలు ఐవీపీ రాజు ,ప్రసాదుల లక్ష్మీ వర ప్రసాద్ బొద్దుల నరసింగరావు మీడియాతో మాట్లాడారు.
previous post