31.2 C
Hyderabad
May 2, 2024 23: 10 PM
Slider నల్గొండ

పోతరాజు కుంటలో రైసు మిల్లును కూల్చివేయాలి

#CPI Nalgonda

నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజక వర్గం చిట్యాల మున్సిపాలిటీ లో సర్వే నెంబర్ 437 లో పోతురాజు కుంట ను ఆక్రమించిన  21గుంటల స్థలంలో అక్రమ నిర్మాణం చేసిన మిల్లును కూల్చివేయాలని సిపిఐ నకిరేకల్ నియోజకవర్గం ఇంచార్జి శ్రావణ్ కుమార్ డిమాండ్ చేశారు.

ఎఫ్ టి ఎల్ బఫర్ జోన్ నిబంధనలు ఉల్లంఘించి  గత మూడు సంవత్సరాల నుండి నిర్మాణం జరుగుతున్నప్పటికీ స్థానిక రెవెన్యూ తహశీల్దార్, నీటిపారుదల శాఖ అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరించడం జరిగిందన్నారు.

చెరువు శిఖం లో మిల్లు నిర్మాణం చేసిన యాజమాన్యంపై కేసు నమోదు చేసి పోతరాజు కుంటను పట్టణ అభివృద్ధికి ఉపయోగించుకునేందుకు జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని శ్రవణ్ కుమార్  డిమాండ్ చేశారు.

విలేకర్ల సమావేశంలో మండల కార్యదర్శి ఎండి అక్బర్, ఏ ఐ ఎస్ ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు షేక్ షరీఫ్, మండల సీనియర్ నాయకులు బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

Related posts

విక్రమ్ ల్యాండర్ పై ఆశ వదులుకోవాల్సిందేనా?

Satyam NEWS

మెదక్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న రాజీనామాల పర్వం

Satyam NEWS

హైకోర్టు తీర్పు జగన్ ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలి

Satyam NEWS

Leave a Comment