ఈరోజు చిన్న శంకరంపేట మండలం వైస్ ఎంపీపీ సత్యనారాయణ గౌడ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి సమక్షంలో గులాబీ గూటికి చేరారు. వారికి కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు కాంగ్రెస్ పార్టీలో గత పది సంవత్సరాలుగా కష్టపడుతూ, క్యాడర్ ను కాపాడుకుంటే.. కష్టపడిన కార్యకర్తలకు కాకుండా పారాషూట్ నాయకులకు.. డబ్బులకు టికెట్లు అమ్ముకొని టికెట్ ఇచ్చారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ కార్యకర్తలకు విలువ లేకుండా పోయిందని.. మనస్థాపంతో రాజీనామా చేస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో నిఖార్సైన కార్యకర్త ఎవరూ లేరని, అంతా రాజీనామాల బాటతో బయటకు వచ్చారని తెలిపారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండేది పారాషూట్ నాయకులు ఇచ్చే డబ్బులకు ఆశపడ్డ వాళ్ళు మాత్రమేనని, నిఖార్సైన కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కరు కూడా లేరు అని తెలియజేశారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డి ని అత్యంత భారీ మెజార్టీతో గెలిపించి తీరుతామని తెలియజేశారు. వారితో పాటు మండల సోషల్ మీడియా కన్వీనర్ నవీన్, కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీలో చేరారు.
previous post
next post