విజయనగరం జిల్లా పోలీసు బాస్…దీపికా ఎం.పాటిల్ ఆదేశాల తో విజయనగరం ఇంచార్జ్ డీఎస్పీ శ్రీనివాసరావు సమక్షంలో నగర సీఐ డా.బీ.వెంకటరావు… అలాగే ఎస్ఐ భాస్కరరావు లు…నగరంలో ని రైల్వే స్టేషన్ పరిసరాల్లో దాడులు నిర్వహించారు. ఇటీవలే అక్కడే గంజాయి లభ్యమవడం…దాంతో పాటు ఓ మైనర్ ఆధ్వర్యంలో అమ్ముతుండనాన్ని గుర్తించి న వన్ టౌన్ సీఐ డా.వెంకటరావు.. తదనంతరం… డీఎస్పీ సూచనలతో రైల్వే స్టేషన్ ప్రాంతంలో గట్టిగా నిఘా పెట్టారు.
తాజాగా ఎస్పీ ఆదేశాలతో డీఎస్పీ శ్రీనివాసరావు… తన బృందమైన సీఐ ,ఎస్ఐ లతో రాత్రి ఏడు నుంచీ 8 గంటల వరకు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. అక్కడే ఇటీవలే కొత్త ప్రారంభించిన ఏసీ రెస్టారెంట్ యజమానికి… సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని డీఎస్పీ ఆదేశాలిచ్చారు. అయితే తాజాగా తనిఖీలలో రెస్టారెంట్ ముందు రెండు చోట్ల సీసీ కెమారాలు లేకపోవడం చూసి….వెంటనే ..ఏర్పాటు చేయాలని… అసలు ఎక్కడ పెడుతున్నారో…ముందు గా తనకు చెప్పాలని అక్కడికక్కడే ఆదేశాలు ఇచ్చారు… డీఎస్పీ శ్రీనివాసరావు. దాదాపు గంటన్నర పైగా రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా సోదాలతో పాటు.. చీకటి ప్రదేశాలను… గంజాయి కి అడ్డాగా ఉన్న ప్రదేశాలను..పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు.