కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పట్టణంలోని అర్చిడ్స్ పాఠశాలకు చెందిన బస్సు ఓ వ్యక్తిని ఢీకొట్టింది. పట్టణంలోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద గాంధీనగర్ కాలనీకీ చెందిన పత్రి అంజయ్యను స్కూల్ బస్సు ఢీకొనగా అతనికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్సలు అందిస్తున్నారు. పాఠశాల బస్సు డ్రైవర్ అజాగ్రత్తగా నడపడం వల్లనే అతనికి ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు
previous post
next post