ఆంధ్రప్రదేశ్ లో వై ఎస్ జగన్ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీఓ 81, 85 లను రాష్ట్ర హైకోర్టు కొట్టేసింది.
ఇంగ్లీష్ మీడియంలో చదవాలా లేక తెలుగు మీడియంలో చదవాలా అనే అంశాన్ని పిల్లలు, వారి తల్లిదండ్రులు నిర్ణయించుకోవాలి కానీ కచ్చితంగా ఈ మీడియంలోనే చదవాలని నిర్దేశించడం తగదని ఇంద్రనీల్ అనే న్యాయవాది ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
దీనిపై వాదోప వాదనలు ముగిసిన తర్వాత జడ్జిమెంటును హైకోర్టు రిజర్వు చేసింది. కాగా నేడు హైకోర్టు తుది తీర్పు వెలువరించింది. నేడు జీవోలను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.