37.2 C
Hyderabad
May 2, 2024 14: 29 PM
Slider మహబూబ్ నగర్

కొల్లాపూర్ సమీపంలో తుఫాన్ వ్యాన్ బోల్తా

kollapur acce 22

కొల్లాపూర్ మండల అంకి రావు పల్లి గ్రామ సమీపంలో తుఫాను వ్యాన్ బోల్తాపడి వాహనంలో ఉన్న ప్రజలకు తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే శుక్రవారం  మధ్యాహ్నం మూడున్నర గంటల సమీపంలో కొల్లాపూర్ నుండి హైదరాబాద్ కి వెళ్తున్న తుఫాన్ వ్యాన్ కొల్లాపూర్ ప్రాంతం దాటి స్పీడుగా వెళుతున్న సమయంలో ప్రమాదం జరిగింది. తుఫాన్ వ్యాన్ నెంబర్  ap22y6168 అతిస్పీడ్ తో డ్రైవర్ ఫోన్ మాట్లాడుతూ నడిపడని తెలిసింది. తుఫాను కంట్రోల్ తప్పి రాయి కి తగలడంతో బోల్తాపడిందని సమాచారం. వాహనంలో ఉన్న ప్రయాణికులు పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. 108కు సమాచారం ఇవ్వడంతో వెంటనే అంబులెన్స్ అక్కడికి చేరుకొని గాయాలైన బాధితులను కొల్లాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుల వివరాలు విష్ణు చుక్కాయి  పల్లి, నక్క సతీష్ ఎల్లూరు,దాదాజి ఆయుర్వేద డాక్టర్ కొల్లాపూర్, సుజాత,నేహా జటప్రోల్, శేఖర్ కొప్పునూర్, నేహా, అనిఫ్ఫా పెంట్ల వెళ్లి వీరికి కొల్లాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. శోభారాణి, విష్ణు, దాదాజి, నేహాలకు సీరియస్ ఉండడంతో  మహబూబ్ నగర్ ఎస్వీఎస్ ఆసుపత్రి కి రేఫర్ చేశారు. సిఐ బి.వెంకట్ రెడ్డి ,ఎస్ఐ కొంపల్లి మురళి గౌడ్ సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. బాధితులకు వైద్యులతో  మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఎంపిపి గాదెల సుధారాణి,మార్కెట్ యార్డ్ చైర్మన్ నరేందర్ రెడ్డి,మాజీ మంత్రి జూపల్లి వర్గం మాజీ జేట్పిటిసి హను మంత్ నాయక్,పసుపుల నరసింహ్మ,బోరెల్లి మహేష్,ఎండి ఎక్బాల్,రహీం,బాబా ఎమ్మెల్యే వర్గం  ప్రభుత్వ ఆసుపత్రిలో  బాధితులకు సహాయం అందించారు.

Related posts

హిందూ ఐక్యత వెల్లడించేందుకు 30న దీక్షకు పిలుపు

Satyam NEWS

ఆగస్ట్‌ ఒకటి నుంచి గురుకుల నియామక పరీక్షలు

Bhavani

ఉపాధ్యాయ జీవితం ఉన్నతమైనది

Satyam NEWS

Leave a Comment