రహదారి భద్రత.. అందరి బాధ్యత అని…విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారీ అన్నారు. ఈ నెల 18 నుంచీ రాష్ట్రంలో 32వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.
ఇందులో భాగంగా విజయనగరం జిల్లా కేంద్రంలో మయూరీ జంక్షన్ వద్ద కెనరా బ్యాంకు, ట్రాఫిక్ పోలీసు సంయుక్తంగా చైతన్య కార్యక్రమం నిర్వహించింది.
ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ రాజకుమారీ, ట్రాన్స్ పోర్ట్ కమీషనర్ శ్రీదేవి మాట్లాడారు. రహదారి భద్రత ప్రతీ ఒక్కరి బాధ్యత అని ఎస్పీ అన్నారు.
ఆర్ టీ.ఏ కమీషనర్ శ్రీదేవి మాట్లాడుతూ…రోడ్డు భద్రతా మాసోత్సవాలు సందర్భంగా ప్రతీ ఒక్కరూ నిబంధనలు తెలుసుకుని రోడ్డు పై వాహనాలను నడపాలన్నారు.
అంతకు ముందు బెలూన్లను ఎస్పీ ఎగుర వేసారు. అనంతరం ప్రారంభమైన ర్యాలీ కోట జంక్షన్ వరకు కొనసాగింది.