30.7 C
Hyderabad
April 29, 2024 06: 20 AM
Slider నల్గొండ

అమరుల త్యాగఫలమే నేటి మన స్వాతంత్ర్యం

#NalgondaPolice

దేశ స్వాతంత్ర్యం కోసం అసువులు బాసిన అమరుల త్యాగం వెలకట్టలేనిదని నల్లగొండ అదనపు ఎస్పీ నర్మద అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం అసువులు బాసిన అమరులను స్మరిస్తూ శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ దేశం కోసం, దేశ ప్రజలకు స్వేచ్చ స్వాతంత్య్రం కల్పించడం లక్ష్యంగా వేలాది మంది స్వాతంత్ర్య పోరాటంలో పాలుపంచుకొని తమ ప్రాణాలను సైతం అర్పించారని, వారి త్యాగ ఫలితంగానే నేడు మనమంతా ఆ ఫలాలను అనుభవిస్తున్నామని చెప్పారు.

అలాంటి త్యాగధనులను స్మరించుకోవడం దేశ పౌరులుగా మనందరి బాధ్యత అన్నారు. కార్యక్రమంలో డిపిఓ ఏ.ఓ..మంజు భార్గవి, సూపరింటెండెంట్లు అతిఖుర్ రెహమాన్, దయాకర్ రావు, ఎస్.బి. డిఎస్పీ రమణా రెడ్డి, ఆర్.ఐ.లు నర్సింహా చారి,  సిఐలు రవీందర్, ఆంజయ్య, రౌతు గోపి, సిబ్బంది జమీల్, లియాఖత్, రాజు, ఖలీల్, షాకీర్, యాసిన్, గౌస్, మహేందర్ రెడ్డి, వెంకన్న, ఆర్.ఎస్.ఐ. అశోక్, లియాఖత్ తదితరులున్నారు.

Related posts

జపాన్ లో ప్రవాసులపై మోడీ సమ్మోహనాస్త్రం

Satyam NEWS

మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుకు కరోనా పాజిటీవ్

Satyam NEWS

బోనాల పండుగ

Satyam NEWS

Leave a Comment