వాహనాల దారులు డ్రైవర్లు ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని ములుగు ఎస్సై హరికృష్ణ అన్నారు. బుధవారం 32 వ జాతీయ రోడ్డు, భద్రతా వారోత్సవాలలో భాగంగా జిల్లా కేంద్రం లోని పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్సై హరికృష్ణ ఆధ్వర్యంలో ప్రైవేట్ వాహన డ్రైవర్లకు బుధవారం రోడ్డు భద్రత పై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఎస్పై మాట్లాడుతూ పరిమితికి మించి ప్రజలను వాహనాలలో ఎక్కించవద్దని , మద్యం తాగి వాహనాలు నడపవద్దని, ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే వరకు డ్రైవర్లు భాద్యత వహించాలని సూచించారు.
రహదారి ప్రమాదాల వలన అకాల మరణాలు సంభవించి ఎన్నో కుటుంబాలు బజారున పడుతున్నాయని, ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నియమాలు పాటించాలని, ఒక్కరి స్వార్థం కోసం నిండు ప్రాణాలను బలిచేయవద్దని సూచించారు.
అజాగ్రత్తగా వాహనాలు నడిపితే కేసుల పాలవుతారని తద్వారా కుటుంబాలు ఇబ్బంది పడతాయని అన్నారు. డ్రైవర్లు ప్రమాదాలకు లోను కాకుండా సూచికలను, పరిశీలిస్తూ, క్షేమంగా ప్రయాణం చేయాలని అన్నారు.