రాబరీ కేసులను చేధించడంలో సెంట్రల్ క్రైమ్ స్టేషన్ సిబ్బంది హస్తం లేనిదే జరగదని మరోసారి రుజువైంది. తాజాగా విజయనగరం జిల్లాలోఅదే జరిగింది. ఓ రాబరీ కేసునకు సంబంధించి ఇద్దరు కి లేడీలను పట్టుకోవడం…ఆ కేసు ఇన్వెస్టిగేషన్ లో సెంట్రల్ క్రైమ్ స్టేషన్ సీఐ కాంతారావు మరింత నిశితంగా పరిశోధన చేయడంతో వారంరోజుల చోరీ కేసు ను చేదించ గలిగామని తెలిపారు…విజయనగరం.డీఎస్పీ అనిల్.
జిల్లాలోని కొత్త వలస,అలాగే విశాఖలకు చెందిన ఇద్దరు మహిళా దొంగలు ఆభరణాల చోరీలో దిట్ట. ఇటీవలే గంట్యాడ కు చెందిన ఓ మహిళ….విజయనగరంలో ఆభరణాలు కొనుగోలు చేసి తిరగి గంట్యాడ వెళుతుండగా అయ్యనపేట వద్ద ఆ ఇద్దరు మహిళలు ఆటోలో ఎక్కి…గంట్యాడకు చెందిన మహిళ చేతిలో ఆభరణాలు ఉన్నాయన్న సంగతి గుర్తించారు. గంట్యాడ వచ్చిన తర్వాత ఆటో దిగి…నడుచు కు వెళుతున్న ఆమెను కత్తితో బెదిరించి…రెండు బంగారు గొలుసులను అపహరించుకు వెళ్లారు.
వెంటనే ఫిర్యాదు అందుకున్న గంట్యాడ ఎస్ఐ కిరణ్ కుమార్ నాయుడు…తమ పై అధికారి సీఐ సత్య మంగవేణికి చెప్పడం తద్వారా రోబరీ కేసు కావడంతో సీసీఎస్ టీం కూడా రంగంలోకిదిగింది. వెను వెంటనే ఇలాంటి దొంగతనాలు చేయడంలో కొత్త వలసకు చెందిన వారి పనేనని సీసీఎస్ సీఐ కాంతారావు చెప్పడం..ఆ కోణంలోనే దర్యాప్తు చేయడంతో వారం రోజుల్లోనే ఆ ఇద్దరు కిలేడీలను శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపించారు. ఈ సందర్భంగా దొంగలించిన రెండు ఆభరణాలను స్వాధీనం చేసుకుని ఇద్దరు కిలేడీలను కటకటాల వెనక్కు పంపించారు…రూరల్ పోలీసులు.