పోలీసుల విధులకు ఆటంకం కల్పిస్తూ,పోలీసులపై దురుసుగా ప్రవర్తిస్తూ, దుర్భాషలాడి, పబ్లిక్ న్యూసెన్సు చేస్తున్న ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మాకవరపాలెం లోని ఆర్ ఆర్ రెస్టారెంట్ లో మద్యం మత్తులో వీరంగం సృష్టించిన గోలుగొండ మండలం పాకలపాడు గ్రామం ఎంపిటిసి భర్త యాళ్ల సన్యాసి నాయుడు, ఏటిగైరంపేటకు చెందిన దనబోయిన నానాజి పై కేసు నమోదు చేసినట్లు తెలిపిన ఎస్ ఐ రామకృష్ణ తెలిపారు.
రెండు రోజుల క్రితం అధికార పార్టీ ఎంపిటిసి భర్త, విద్యకమిటి చైర్మన్ అనే మదంతో మద్యం మత్తులో పోలీసులు, రెస్టారెంట్ సిబ్బంది పై దురుసుగా ప్రవర్తించిన సంఘటన సత్యంన్యూస్ వీక్షకులకు తెలిసిందే. పోలీసుల విధులకు ఆటంకం కల్పిస్తూ,పోలీసులపై దురుసుగా ప్రవర్తిస్తూ, దుర్భాషలాడి, పబ్లిక్ న్యూసెన్సు చేస్తున్న ఇద్దరిపై కేసు నమోదు 353,506,186,290 , r/w 34 ఐపీసీ సెక్షన్లపై కేసు నమోదు చేయడం జరిగింది. వీరిని కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి ఇద్దరికి 14 రోజులు రిమాండ్ విధించినట్లు మాకవరపాలెం ఎస్ ఐ రామకృష్ణ వెల్లడించారు.