38.2 C
Hyderabad
May 3, 2024 21: 38 PM
Slider ముఖ్యంశాలు

రోట‌రీ ఒకేష‌న‌ల్ ఎక్స్ లెన్స్‌ అవార్డులు: విద్య‌ల న‌గ‌రానికి రానున్న హైకోర్టు జ‌స్టిస్

#justicemanavendrarai

విజ‌య‌న‌గ‌రం సెంట్రల్ రోట‌రీ క్లబ్ ఆధ్వర్యంలో జ‌రిగే ఒకేష‌న‌ల్ మంత్ ముగింపు కార్యక్రమానికి హైకోర్టు జ‌స్టిస్ రానున్నారు. స్థానిక‌ ఎస్‌.వి.ఎన్‌.లేక్ ప్యాలెస్ లో జ‌ర‌గ‌నున్న ఈ సద‌స్సులో వివిధ రంగాల్లో విశిష్ట‌ సేవ‌లందించిన ప్రభుత్వ ఉద్యోగుల‌కు ఒకేష‌న‌ల్ ఎక్సలెన్స్ అవార్డులు అందిస్తున్నారు.

దీనిలో భాగంగా ఏ.పి. హైకోర్టు న్యాయ‌మూర్తి, జిల్లా వాస్తవ్యులు జ‌స్టిస్ సిహెచ్‌.మాన‌వేంద్రనాథ్ రాయ్‌కు రోట‌రీ క్లబ్ విజ‌య‌న‌గ‌రం సెంట్రల్ ఆధ్వర్యంలో రోట‌రీ ఒకేష‌న‌ల్ పుర‌స్కారం అందుకోనున్నారు. ఈ విష‌యాన్ని రోట‌రీక్లబ్ ఒకేష‌న‌ల్ మంత్ వేడుక‌ల కార్యక్రమం ఛైర్మన్ తూనుగుంట్ల న‌ట‌రాజ్ తెలిపారు. నెల‌రోజుల‌పాటు నిర్వహించిన ఒకేష‌న‌ల్ మంత్ ముగింపు సంద‌ర్భంగా ఈ అవార్డులు అందిస్తున్నట్టు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రోట‌రీ జిల్లా గ‌వ‌ర్నర్ రొటేరియ‌న్‌ ఎం.రామారావు పాల్గొంటార‌ని వెల్లడించారు. రోట‌రీ అసిస్టెంట్ గ‌వ‌ర్నర్ కిషోర్ కుమార్ జైన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటార‌ని తెలిపారు. ఉద‌యం 8.30 గంట‌ల‌కు ఈ కార్యక్రమం ప్రారంభ‌మ‌వుతుంద‌న్నారు.

Related posts

వర్గల్ సిద్ధాంతి ని పరామర్శించిన మంత్రి హరీష్ రావు

Satyam NEWS

మహిళా కాంగ్రెస్ కు కొత్త శక్తి: ఏ బ్లాక్ అధ్యక్షురాలిగా అమరేశ్వరి

Bhavani

వైసీపీ లో చేరలేదనే అక్రమ కేసులు పెడుతున్నారు

Satyam NEWS

Leave a Comment