విజయనగరం సెంట్రల్ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో జరిగే ఒకేషనల్ మంత్ ముగింపు కార్యక్రమానికి హైకోర్టు జస్టిస్ రానున్నారు. స్థానిక ఎస్.వి.ఎన్.లేక్ ప్యాలెస్ లో జరగనున్న ఈ సదస్సులో వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన ప్రభుత్వ ఉద్యోగులకు ఒకేషనల్ ఎక్సలెన్స్ అవార్డులు అందిస్తున్నారు.
దీనిలో భాగంగా ఏ.పి. హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా వాస్తవ్యులు జస్టిస్ సిహెచ్.మానవేంద్రనాథ్ రాయ్కు రోటరీ క్లబ్ విజయనగరం సెంట్రల్ ఆధ్వర్యంలో రోటరీ ఒకేషనల్ పురస్కారం అందుకోనున్నారు. ఈ విషయాన్ని రోటరీక్లబ్ ఒకేషనల్ మంత్ వేడుకల కార్యక్రమం ఛైర్మన్ తూనుగుంట్ల నటరాజ్ తెలిపారు. నెలరోజులపాటు నిర్వహించిన ఒకేషనల్ మంత్ ముగింపు సందర్భంగా ఈ అవార్డులు అందిస్తున్నట్టు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రోటరీ జిల్లా గవర్నర్ రొటేరియన్ ఎం.రామారావు పాల్గొంటారని వెల్లడించారు. రోటరీ అసిస్టెంట్ గవర్నర్ కిషోర్ కుమార్ జైన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. ఉదయం 8.30 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు.