RRR సినిమా వస్తుందన్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో సినిమా టికెట్లు అధికంగా పెంచడాన్ని ఎస్ఎఫ్ఐ నాగర్ కర్నూల్ జిల్లా కమిటీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు డి. శేఖర్ అన్నారు. ఈ సందర్భంగా శేఖర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న సినిమా థియేటర్ లో అధిక రేట్లు పెంచాలని జీవో విడుదల చేయడం సరైనది కాదని అన్నారు.
ఈనెల 25 నుండి 27 వరకు 50 రూపాయల చొప్పున, 28 నుండి ఏప్రిల్ 3 వరకు 30 రూపాయలు పెంచవచ్చని ప్రభుత్వం చెప్పడం తీవ్రంగా ప్రజా వ్యతిరేకమని అన్నారు. ఈ రాష్ట్రంలో చాలామంది ప్రజానీకం మరియు కార్మికులు, విద్యార్థులు యువకులు, వారితో పాటు అభిమానులు .సినిమా టికెట్లు పెంచడం పై తీవ్ర ఇబ్బందికి గురవుతునన్నారని తెలిపారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్లు పెంచాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని తెలిపారు. లేనిచో రాష్ట్రవ్యాప్తంగా ఈ అంశంపై పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని అన్నారు.