హైదరాబాద్ నగరంలోని సైదాబాదులో ఆరు సంవత్సరాల గిరిజన బాలికపై జరిగిన అఘాయిత్యంపై నారాయణపేట జిల్లా అంబేద్కర్ భవన్ లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో మహిళా సంఘర్షణ సమితి అధ్యక్షురాలు ఈశ్వరమ్మ, బి ఎస్ పి జిల్లా నాయకురాలు అనిత, అంబేద్కర్ యువజన సంఘం మండల ప్రధాన కార్యదర్శి చంటి డి బి ఎస్ యు నారాయణపేట జిల్లా చిన్నయ్య అధ్యక్షుడు దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ భారతదేశంలో మహిళలపై ఏండ్ల తరబడి జరుగుతున్న అత్యాచారాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని అన్నారు.
ఇది చాలా సిగ్గుచేటు అని, ఇలాగే జరిగితే రానున్న ఈ రోజుల్లో మరో అఫ్ఘనిస్తాన్ గా మారే అవకాశం ఉందని ఆమె అన్నారు. బడుగు బలహీన వర్గాల పై అత్యాచారం జరిగితే రాష్ట్ర ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోవడం లేదని అన్నారు.
ఈ కార్యక్రమంలో మహిళా సంఘర్షణ సమితి అధ్యక్షురాలు ఈశ్వరమ్మ బి ఎస్ పి జిల్లా నాయకురాలు అనిత డి బి ఎస్ యు జిల్లా అధ్యక్షుడు చిన్నయ్య అంబేద్కర్ యువజన సంఘం నారాయణపేట మండల ప్రధాన కార్యదర్శి చంటి మాజీ కౌన్సిలర్ సుజాత తదితరులు పాల్గొన్నారు.