ముఖ్యమంత్రి కేసీఆర్ కు కేవలం ముందు జాగ్రత్తతో మాత్రమే వైద్య పరీక్షలు మాత్రమేనని డాక్టర్ ఎం.వి.రావు అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కి ప్రతి ఏటా ఫిబ్రవరిలో పరీక్షలు చేస్తుంటామని ఆయన తెలిపారు. రెండు రోజులుగా బలహీనంగా ఉన్నట్లు ఆయన చెప్పారని అందుకోసం సాధారణ వైద్య పరీక్షలు చేస్తున్నామని ఆయన వివరించారు. ఎడమ చెయ్యి, ఎడమ కాలు కొంచెం నొప్పిగా ఉందని కేసీఆర్ అంటున్నట్లు వైద్యులు తెలిపారు. దీంతో ముందు జాగ్రత్తగా మరికొన్ని పరీక్షలు చేస్తున్నామని సీఎం కేసీఆర్ వ్యక్తిగత డాక్టర్ శ్రీ ఎం.వి.రావు తెలిపారు. రొటీన్ పరీక్షల్లో భాగంగానే సీఎం కి సీటీ స్కాన్, కార్డియాక్ యాంజియోగ్రామ్ చేస్తున్నామని తెలిపారు. ఈ పరీక్షల ఫలితాలను బట్టి ఏంచేయాలో తర్వాత నిర్ణయిస్తామని ఆయన అన్నారు. ప్రస్తుతానికి కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన తెలిపారు.
previous post