33.7 C
Hyderabad
April 29, 2024 01: 09 AM
Slider నిజామాబాద్

సిద్దాపూర్ రిజర్వాయర్ పనులు త్వరగా పూర్తి కావాలి

#siddapur

నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం వర్ని మండలం సిద్దాపూర్ వద్ద నూతనంగా నిర్మిస్తున్న సిద్దాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనులను తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి నేడు పరిశీలించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, సాగునీటి శాఖ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

రూ.120 కోట్లతో నిర్మిస్తున్న సిద్దాపూర్ రిజర్వాయర్ ద్వారా బాన్సువాడ నియోజకవర్గం లోని పన్నెండు వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. దీనివల్ల మెట్ట ప్రాంతాలకు ప్రయోజనం చేకూరుతుంది. వానాకాలం మొదలైనందున పనులలో వేగం పెంచాలని కాంట్రాక్టు ఏజెన్సీ కి స్పీకర్ పోచారం సూచించారు.

వర్షాలు కురిసి పనులకు అంతరాయం కలగకముందే మట్టి పనులను వేగంగా పూర్తి చెసే విదంగా నిత్యం పనులను పర్యవేక్షించాలని సాగునీటి శాఖ అధికారులను ఆదేశించారు. అదే విధంగా రిజర్వాయర్ కట్ట పనులతో సమానంగా కాలువల నిర్మాణ పనులు జరపాలని అధికారులకు ఆదేశం ఇచ్చారు.

Related posts

తెలంగాణ లో లాక్ డౌన్ విధించేది లేదు: కేసీఆర్

Satyam NEWS

నీట్, జేఈఈ సాధన కు “కోటా” డిస్టెన్స్ లెర్నింగ్

Satyam NEWS

ఈ సారి తెలంగాణలో ఏం జరుగుతుందో…?

Satyam NEWS

Leave a Comment