ఢిల్లీ లిక్కర్ కుంభకోణంతో తమకు సంబంధం లేదని వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి తెలిపారు. తాము 70 ఏళ్ల నుండి లిక్కర్ వ్యాపారం లో ఉన్నామని, మొత్తం 8 రాష్ట్రాలలో తమకు వ్యాపారాలు ఉన్నాయని ఆయన తెలిపారు.
ఎక్కడ మచ్చ లేని వ్యాపారం చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల తమ చెన్నె, ఢిల్లీ నివాసాల్లో ఎన్ ఫోర్సెమెంట్ డైరక్టరేట్ దాడులు జరిగిన మాట వాస్తవమేనని ఆయన అన్నారు. అయితే ఆ దాడుల్లో ఏవిధమైన ఆధారాలు, అక్రమాలు జరగలేదని ఈడి అధికారులు తేల్చారని శ్రీనివాసరెడ్డి అన్నారు. పంచనామా లో కూడా ఇదే రాశారని ఆయన తెలిపారు. తమ పై నే కాదు ..దేశం లో 32 మంది వ్యాపారుల పై కూడా శోదాలు చేశారని ఆయన వెల్లడించారు.