26.7 C
Hyderabad
May 3, 2024 08: 27 AM
Slider కడప

బస్సు కోసం రోడ్డు మార్గం పరిశీలన….

#apsrtc

కడప జిల్లా రాజంపేట మండలం ఎకిరిపల్లి కి ఆర్టీసి బస్సు వసతికి రోడ్డు మార్గాన్ని ఆదివారం  ఆర్టీసి ఛైర్మెన్ ఏ. మల్లికార్జున రెడ్డి, జెడ్పీ చైర్మన్ అకేపాటి అమరనాథ్ రెడ్డి తదితరులు పరిశీలించారు. మారు మూల గ్రామం ఎకిరిపల్లికి బస్సు సౌకర్యం కల్పించాలని  జిల్లా పరిషత్ చైర్మన్ అకేపాటి అమరనాధ రెడ్డి కోరారు. ఆయన వినతి మేరకు ఆర్టీసీ చైర్మన్ ఆ ప్రాంతాన్నీ పరిశీలించారు.త్వరలో రెండు ట్రిప్పులు బస్సు సౌకర్యం కల్పిస్తామని ఆర్టీసి ఛైర్మెన్ దుగ్గాయపల్లి మల్లికార్జున రెడ్డి ఈ సందర్భంగా వెల్లడించారు.ఆర్టీసీ చైర్మన్ ను శాలువాకప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో  రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆకేపాటి మురళి రెడ్డి,ప్రభుత్వ ఆర్టీసి అధికారులు పాల్గొన్నారు.

Related posts

కరోనా వ్యాక్సిన్ వికటించి వాలంటీర్ మృతి

Satyam NEWS

Analysis: మూడో ముప్పులో అలసత్వం

Satyam NEWS

ఇంకా నాశనం చేయడానికి ఏపీలో ఏముంది?

Satyam NEWS

Leave a Comment