శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రెంటికోట గ్రామం లో ఈ ఘటన జరిగింది.
రెంటికోట గ్రామ వాలంటీర్ రెయ్యి లలిత(29), శుక్రవారం(5-02-2021)మధ్యాహ్నం కరోనా వ్యాక్సిన్ వేసుకున్నారు.
అనాటి నుంచి కొంత అస్వస్థతకు గురయ్యారు. నేటి తెల్లవారుజామున ఆమె మృతి చెందారు.
మృతురాలు లలిత కి భర్త వాసుతో పాటు ఆరేళ్ళ బాబు ఉన్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.