బాదుడే బాదుడు అంటూ ఇప్పుడు మరో బాదుడు మొదలు పెట్టింది జగన్ ప్రభుత్వం. చెత్త పన్ను విధింపు, ఇంటిపన్ను పెంపు, కరెంటు చార్జీల పెంపుతో ఇప్పటికే జనంపై భారం మోపిన జగన్ ప్రభుత్వం ఇప్పుడు ఆర్టీసీ బస్సు ఛార్జీలను పెంచింది. డీజిల్ ధరల పెరుగుదలతో ఛార్జీలు పెంచినట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. పల్లె వెలుగు బస్సు కనీస ఛార్జీ రూ. 10 పెంచినట్లు తెలిపారు.
ఆర్టీసీ చార్జీలపై డీజిల్ సెస్ విధించారు. పల్లె వెలుగు బస్సుల్లో రూ. 2 ఎక్స్ప్రెస్ బస్సుల్లో రూ. 5 పెంచినట్లు ఆర్టీసీ ఎండీ తెలిపారు. డీజిల్ బల్క్ రేటు విపరీతంగా పెరిగిందని ఆర్టీఎసీ ఎండీ ద్వారకా తిరుమలరావు పేర్కొన్నారు. రేపట్నుంచి పల్లె వెలుగు బస్సులో కనీస చార్జి రూ.10 ఉంటుందని ఆయన వెల్లడించారు. సెస్ పెంపు వల్ల ఆర్టీసీకి రూ.720 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని ఆర్టీసీ ఎండీ వెల్లడించారు.