హైదరాబాద్ ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు టికెట్ ధరల్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సిటీ బస్సుల్లో 24 గంటల పాటు ప్రయాణించడానికి వీలుండే టీ-24 టికెట్ ధరలను పెంచారు.
సాధారణ ప్రయాణికులకు ఈ టికెట్ ధరలను రూ.90 నుంచి రూ.100కి పెంచారు. సీనియర్ సిటీజన్లకు (పురుషులు, స్త్రీలు, 12 ఏళ్లు పైబడిన బాలికలు) టికెట్ ధర రూ.80 ఉండగా దాన్ని 90కి పెంచింది..