గుంటూరు జిల్లాలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కోటప్ప కొండ త్రికోటేశ్వర స్వామి తిరునాళ్ళకు ఆర్టీసీ గణనీయమైన ఆదాయం సంపాదించింది. ఆర్టీసీ బస్సులు నడపడం ద్వారా నరసరావుపేట డిపోకు వచ్చిన ఆదాయం రూ. 66,56,201లు అని డిపో మేనేజర్ షేక్ అబ్దుల్ సలాం తెలిపారు.
నరసరావుపేట డిపో నుండి 293 బస్సుల ద్వారా 2,76,295 మంది ప్రయాణికులకు ఆర్టీసీ ద్వారా సేవలు అందించినట్లు తెలిపారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రయాణికులకు సురక్షితమైన ప్రయాణాన్ని అందించిన సిబ్బందికి, సహకరించిన ప్రభుత్వ అధికారులకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.