ఉత్తరాంద్రలో పూసపాటి వంశీయులంటే….అలనాటి రాజుల చరిత్ర…అలాగే విజయనగరం, బొబ్బిలి, కోటల సంగతి ఆక్కడ పాలించిన రాజుల చరిత్రను..నెట్ లో కొడితే ప్రతీ ఒక్కరికి ఇట్టే తెలుస్తుంది.అయితే ఈ సోది అంతా ఎందుకంటారా…? అక్కడికే వస్తున్న…ఆ రాజుల పరపతి…రాచరిక వ్యవస్థ…పరిపాలన దక్షతల గురించి…క్షత్రియులుంతా… సఃఘాలుగా ఏర్పడి…విజయనగర కోటను,అలాగ మహారాజా కళాశాలను కట్టిన పూసపాటి విజయరామ గజపతిని జయంతి సందర్బంగా కొన్ని సేవా కార్యక్రమాలు చుట్టి తద్వారా క్షత్రియులు. రాజుల చరిత్రను భావి తరాలకు తెలియ చెప్పే యత్నానికి శ్రీకారం చుట్టారు.
అందులో భాగంగా వచ్చే నెల 1న స్వర్గీయ పూసపాటి విజయగజపతిరాజు జయంతి సందర్బంగా పేద్ద వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్టు క్షత్రియ పరిషత్, క్షత్రియ సేవాసంఘం పేర్కొంది. ఈ మేరకు నగరంలోని ఆయోద్యా మైదానం వద్ద ఉన్న క్షత్రియ కల్యాణ మండపంలో కమిటీ సభ్యులైన.. దన్తులూరి సీతా రామ రాజు ,సాగి శివాజి రాజు గొట్టిముక్కల రామ రాజు, నాలుగు ఎస్సెల రాజులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
మే ఒకటవ తేదీన రాజాసాహెబ్ డాక్టర్ పీవీజీరాజు జయంతి సందర్భం క్షత్రియ సేవా సమాఖ్య , క్షత్రియ పరిషత్ విజయనగరo ఆధ్వర్యo లో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కుల మతాలకు అతీతంగా జరుగుతున్న ఈ మెగా మెడికల్ క్యాంప్ నకు విశాఖ అత్యంత ప్రసిద్ది చెందిన ప్రముఖ వైద్య నిపుణులచే వైద్య సేవలు, అవసరమైన మందులు అందిస్తామని తెలిపారు.
అదే రోజు కేంద్ర మాజీ మంత్రి,టీడీపీ పోలిట్ బ్యూరోసభ్యుడు అశోక్ గజపతి రాజు ప్రత్యేక వైద్య శిబిరం ప్రారంభిస్తారని తెలిపారు. అలాగే ఎమ్మెల్సీలు రఘువర్మ, పెనుమత్స సూర్యనారాయణ, ఇందుకూరి రఘురాజు తదితర పెద్దలంతా హాజరవుతారని చెప్పారు. ప్రముఖ రొబొటిక్ జోయింట్ రిప్లెస్ మెంట్ డాక్టర్ ఇందుకూరు సతీష్ రాజు సతీష్ కలిదిండి ,డాక్టర్ డీఆర్ ఎం జగన్నాద రాజు, డా. డీ.రామకృష్ణ రాజు, డా రవీంద్ర వర్మ,డా,ఎంఎన్వీ పల్లవి, డాక్టర్ సంతోష్ రాజు లాంటి వైద్యుల పర్యవేక్షణలో ఆ మెగా వైద్య శిబిరం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.