ఈ ఏడాది రెండో విడత రైతుల ఖాతాలో నగదు జమ చేయడానికి రెడీ అవుతుంది సర్కారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రైతాంగానికి వచ్చే నెలలో యాసంగి రైతుబంధు నిధులు జమ కానున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. ఇందుకోసం సిఎం కేసీఆర్ ఇప్పటికే అధికారులకు ఆదే శాలు జారీ చేశారని ఆయన పేర్కొన్నారు. రెండో పంట సాగుకు డిసెంబర్ లో రైతుబంధు సాయం అందజేస్తామని ప్రకటించారు. డిసెంబర్ 1 తర్వాత రైతుబంధు సాయం నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేయగా, ఆర్థిక శాఖ ఆమోదించిందని చెప్పారు. రైతుబంధు కింద ఏడాదికి రెండుసార్లు రూ. 5వేలు చొప్పున 10 వేలు రైతుల ఖాతాల్లో డిపాజిట్ చేస్తారు.
previous post
next post