రాష్ట్రంలో నకిలీ ఎరువులు, విత్తనాలు, పురుగు మందులను అరికట్టాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘం పిలుపు మేరకు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ తాసిల్దార్ కార్యాలయం ముందు బుధవారం ధర్నా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కొప్పోజు సూర్యనారాయణ మాట్లాడుతూ నకిలీ ఎరువులు, విత్తనాలు, పురుగుమందులను అరికట్టాలని, చిన్న సన్నకారు రైతులకు సబ్సిడీపై ఎరువులు, విత్తనాలు,మరియు పురుగు మందులను అందించాలని డిమాండ్ చేస్తూ వినతిపత్రం తాసిల్దార్ కు అందజేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు పాలకూరి బాబు, ఏ ఐ టి యు సి జిల్లా నాయకుడు జడ శ్రీను, రైతు సంఘం మండల అధ్యక్షుడు పొనుగుపాటి వాసుదేవరావు, రైతు సంఘం పట్టణ అధ్యక్షుడు జక్కుల రమేష్, వెంకటేశ్వర్లు, అనంతు వీరబాబు, మట్టపల్లి తదితరులు పాల్గొన్నారు.