ప్రజా యుద్ధ నౌక గద్దర్ మృతి పట్ల కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ సంతాపం తెలిపారు. ‘‘దిగ్గజ కవి. నిఖార్సైన ఉద్యమకారుడు గుమ్మడి విట్టల్ మరణవార్త విని బాధగా ఉంది. సామాజిక సమస్యల పట్ల ఆయన చూపిన అంకితభావం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసిన పోరాటం నిజంగా స్ఫూర్తిదాయకం.
గద్దర్ శక్తివంతమైన పద్యాలు లక్షలాది మంది ఆకాంక్షలను ప్రతి ధ్వనించాయి. మన హృదయాలపై చెరగని ముద్ర వేశాయి. ఆయన వారసత్వం మార్పు జ్వాలలను రగిలిస్తూనే ఉండాలని ఆశీస్తున్నాను’’ అని ట్విట్టర్ వేదికగా గద్దర్ మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు.